అందమైన రాష్ట్రం అంధకారంలో చిక్కుకుంది. ప్రకృతి వైద్యాలతో పాటు ప్రకృతి అందాలకు నెలవైన కేరళని భారీ వర్షాలు..వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ధాటికి వందలాది మంది ప్రాణాలు వరదల పాలయ్యాయి. లక్షల్లో జనం నిరాశులయ్యారు. ఇప్పుడిప్పుడే కేరళలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. కేరళలో నాలుగురోజుల పాటు ఇక వర్షాలు లేనట్టేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా బస్సు సర్వీసులను అధికారులు ప్రారంభించారు. ప్రజారవాణాన్ని పునరుద్ధరించిన కేరళ అధికారులు..వరద బీభత్సం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. ఇప్పుడిప్పుడే జనం ఇళ్ళకు వెళ్తున్నారు. సర్వం కోల్పొయిన జనం కన్నీటి పర్యంతం అయ్యారు. ఇళ్లల్లో వరద తగ్గి.. బురద మిగిలింది. ఇంకా మూడు జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. పునరావాస శిబిరాల్లో ఏడు లక్షల జనం ఉన్నారు.