హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వం ప్రకటించిన రూ.25 కోట్ల రూపాయల చెక్కును.. ఆదివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా త్రివేండ్రం వెళ్లి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు అందజేశారు. చిన్నారుల కోసం శనివారం వంద టన్నుల పౌష్టికాహారాన్ని పంపించిన ప్రభుత్వం, ఆదివారం పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం రెండున్నర కోట్ల విలువైన యాభై ఆర్వో ప్లాంట్లను, 20 టన్నుల పాలపొడిని రక్షణశాఖ విమానంలో సహాయ సిబ్బందితోపాటు పంపించింది.