భారీవర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లాలొ కురుస్తున్న భారీవర్షాల వల్ల గోదావరి తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వెల్గటూర్ మండలంలోని రాజరాంపల్లి , సంకెనపల్లి గ్రామాల్లో శానిటేషన్ ,స్వచసర్వేక్షన్ ,హరితహారం కంటివెలుగు కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలొ కుంటలు ,చెరువులు పరిస్థితిని ఎప్పటికపుడు పరిశీలించాలని ..గ్రామల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ ,ఆస్తినష్టం జరగకుండ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను అదేశించారు. జిల్లాలొ కలెక్టరు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శరత్ తహశీల్ధార్లు ,విఆర్ ఓ లు ,ఇంజనీరింగ్ అధికారులు స్థానికంగా ఉండి ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారిచేశారు . ఈ కార్యక్రమంలో వెల్గటూర్ తహశీల్ధార్ రాజెశ్ ,గ్రామ ప్రత్యేకాధికారులు ,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.