హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ప్రత్యేకాధికారులను ఆదేశించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ..ప్రతీ గ్రామంలో డంప్యార్డులు, వైకుంఠధామం ఏర్పాటు చేయాలని అధికారులకు నిర్దేశించినట్లు చెప్పారు. జల ప్రళయంతో విలవిల్లాడుతున్న కేరళ బాధితుల సహాయార్థం తనవంతుగా నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు జూపల్లి ప్రకటించారు.