రామనాథ్పుర: కర్నాటక మంత్రి హెచ్డీ రెవన్నా మానవత్వాన్ని మరిచారు. వరద బాధిత క్యాంపులను సందర్శించిన ఆయన.. అక్కడ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఆహార పదార్ధాలను బాధితుల చేతికి అందివ్వకుండా వారిపైకి విసిరేశారు. రామనాథపురం రిలీఫ్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. సీఎం కుమారస్వామి సోదరుడైన మంత్రి రెవన్నాపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన ప్రవర్తన సరిగా లేదని ఆరోపిస్తున్నారు. కొందరు ఆ ఆహార పదార్ధాలను స్వీకరించేందుకు నిరాకరించారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల .. కర్నాటక తీర ప్రాంతాలైన మల్నాడ్, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమంగళూరు, కొడగు, హసన్ జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి.