తమిళనాడు : కేరళ వరద బాధితులకు సహాయం అందించేందుకు తమిళనాడులోని కోయంబత్తూర్లోని సీఆర్ పీఎఫ్ సతీమణులు ముందుకు వచ్చారు. సీఆర్పీఎఫ్ సతీమణుల సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను సేకరించి కేరళకు పంపింది. వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువులు, దుస్తులు, మందులు, శానిటరీ వస్తువులను 12 ట్రక్కుల్లో నింపి పంపారు సీఆర్పీఎఫ్ జవాన్ల సతీమణులు. వీటిని త్రిస్సూర్, చలక్కూడి ప్రాంతాల్లో బాధితులకు అందించడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లింది.