ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి దేశం కోసం జీవితాన్నిఅంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మాజీ ప్రధాని వాజ్ పేయి సంతాపసభ నిర్వహించారు. సంతాపసభకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, ఇతర నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… నమ్మిన సిద్దాంతాల విషయంలో మోడీ ఏనాడూ రాజీ పడలేదన్నారు.