శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కిష్టావర్లో ఘోర ప్రమాదం జరిగింది. మాచెల్ మాతా దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడటంతో.. ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.