రిపబ్లికన్ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సంచలన విషయమే చెప్పారు. తమిళనాడులో పర్యటించిన ఆయన ప్రస్తుతం పార్లమెంటులో అన్నాడీఎంకె బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉందని ఈ బంధం ఇలానే కొనసాగుతుందని చెప్పారు. ఎప్పుడు సంచలనానికి తెరతీసే అథవాలే ఈసారి కూడా ఈసారి లోక్సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమిలో అన్నా డీఎంకే కూడా ఉంటుందని చెప్పారు. తానే స్వయంగా అన్నాడీఎంకే పెద్దలతో మాట్లాడతానని కూడా చెప్పారు.