అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా ముందంజలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యదర్శులు, హెచ్వోడీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ నాలుగేళ్లలో వివిధ రంగాల్లో 511 అవార్డులు సాధించామన్నారు. రాష్ట్రస్థాయిలో అందరం ఒక బృందంగా పని చేయాలని సూచించారు. ఒక స్ఫూర్తితో అధికార యంత్రాంగం పని చేయాలన్నారు. ఉన్న వనరులను ఎంత సమర్థంగా ఉపయోగించుకున్నామనేదే ముఖ్యమన్నారు. జీవన ప్రమాణాల్లో నాణ్యత పెరగాలన్నారు.