మథుర: ఉత్తరప్రదేశ్లోని రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ఓ రైలు ఏడుగురు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ప్రయాణికుడు హాస్పటల్లో ప్రాణాలు విడిచాడు. గాయపడ్డ మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్లు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. కోశి కొలన్ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. రైలు ఎక్కుదామని ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది.