ట్రెండింగ్
Epaper    English    தமிழ்

373కు చేరిన కేరళ మృతుల సంఖ్య‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 01:02 PM

కేర‌ళ‌లో కురిసిన భారీ వ‌ర్షాలు..వ‌ర‌ద‌ల‌కు 373మంది మృతి చెందారు. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ భారీ నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేరళకు కొన్నేళ్లు పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇడుక్కి, మలప్పురం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. లక్షకుపైగా ఇండ్లు ధ్వంసమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. ప్రస్తుతం జరుగుతున్న సహాయక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కచ్చితమైన నష్టాన్ని లెక్క వేయనున్నారు. ఇప్పటికీ పది లక్షల మందికిపైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు సీఎం పినరయి విజయన్ వెల్ల‌డించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం పూర్తిగా కోలుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుందని నిపుణులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com