కరీంనగర్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటెల రాజేందర్ అధికారులకు తెలిపారు. కరీంనగర్ లోని కలెక్టరేట్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు .. పంచాయతీ కార్యదర్శు లతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి విష జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. జడ్పీ చైర్మన్ తుల ఉమ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులు హాజరైయ్యారు.