ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాల అభివృద్ధిపై రాజకీయాలు వద్దు : ఇంద్రకరణ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 02:43 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాల అభివృద్ధిపై రాజకీయాలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు.. తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రూ. 238 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా అభివృద్ధి జరగడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 400 కోట్లు కేటాయించారని మంత్రి గుర్తు చేశారు. సాంకేతిక కారణాల వల్లే అర్చకుల వేతనాల చెల్లింపులో జాప్యం ఏర్పడిందన్నారు. అర్హులైన మిగతా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com