ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యర్థాల తరలింపునకు అదనపు వాహనాలు: జీహెచ్ఎంసీ కమిషనర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 04:51 PM

హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా బల్దియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జంతు వ్యర్థాల తొలగింపునకు లకన్నర ప్లాస్టిక్ కవర్లు పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వ్యర్థాల తరలింపు కోసం 464 అదనపు వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మజీద్‌లు, ఈద్గాలు, పాతబస్తీలో ఉచితంగా ప్లాస్టిక్ కవర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యర్థాలు తొలగించిన వెంటనే రహదారుల శుభ్రతకు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు పంపిణీ చేశామని..పోలీస్‌శాఖకు అదనంగా 20వేల ప్లాస్టిక్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com