న్యూఢిల్లీ: భారత్లో తొలిసారిగా ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆపిల్ ఇంక్ వెల్లడించింది. ఈ నేపధ్యంలో భారత్లో ఆపిల్ సంస్థ మరింత విస్తరించనుందని సంస్థ అధికారులు తెలిపారు. తైవానీస్ కాంట్రాక్ట్ ఉత్పాదక సంస్థ విస్ట్రన్ కార్ప్ రాబోయే నాలుగు నుండి ఆరు వారాల్లో బెంగళూరులో ఐ ఫోన్ 6, 6ఎస్ ఫోన్ల ఉత్పాదకతను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే భారత్లో ఫోన్ల ఉత్పాదనకు సంబంధించి ప్రభుత్వం నుండి అనుమతులు కూడా పొందామని ఆపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా భారత్లో గత సంవత్సరం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 18శాతానికి పెరగడం విశేషం. అలాగే ఐఫోన్ ఎస్ఇ ఫోన్లు ఇప్పటికే వినియోగదారులకు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి.