న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రముఖ దేశీయ బ్రాడ్బాండ్ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్ను స్వాధీనం చేసుకోనుంది. టికోనా 4జీ డిజిటల్ నెట్వర్క బిజినెస్ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్ బాండ్ వెర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా, ఐదు టెలికాం సర్కిల్స్లో 350 సెట్లు తమ సొంతంకానున్నట్టు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. జియో ఉచిత సేవల ఎంట్రీతో రిలయన్స్ జియో సునామీ సృష్టిస్తే, వొడాఫోన్, ఐడియా మెగామెర్జర్ టెలికాం పరిశ్రమలో సంచలనం మారింది. భారతీ ఎయిర్టెల్ నార్వే ఆధారిత టెలినార్ భారత వ్యాపార కొనుగోలు ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ టికోనాతో ఒప్పందం చేసుకోవడం విశేషం.