కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ విచారణ మే నెల మొదటివారానికి వాయిదా పడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు, నీటి లభ్యత తక్కువ గా ఉన్నప్పుడు ఏ నిష్పత్తిలో పంచుకోవాలో నిర్ణయించడానికి కృష్ణా జలాల ట్రిబ్యునల్ సమావేశమైంది. నీటి పంపిణీ అంశంపై తాము నిపుణులతో చర్చిస్తున్నందున విచారణను నాలుగు వారాలు వాయిదా వేయాలని తెలంగాణ తరఫున.. సీనియర్ న్యా యవాది వైద్యనాథన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నీటి కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగినందున తాజాగా ఎలాంటి వైఖరి అవలంబించాలన్న దానిపై కసరత్తు జరుగుతున్నదని వివరించారు. ఏపీ తరఫున హాజరైన ఏకే గంగూలీ అఫిడవిట్ ముసాయిదా తుది రూపు తీసుకోడానికి వీలుగా కొంత గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రెండు రాష్ర్టాలూ తమతమ అభిప్రాయాలను లిఖితపూర్వక అఫిడవిట్ రూపంలో ఏప్రిల్ 13 నాటికి సమర్పించాలని ట్రిబ్యునల్ అదేశించింది. వాటిపై అభ్యంతరాలు ఏప్రిల్ 27నాటికి, సవరణలను మే నెల 2నాటికి ఇవ్వాలని సూచిస్తూ తదుపరి విచారణను మే నెల 4, 5 తేదీలకు వాయిదా వేసింది.