అసెంబ్లీని అడ్డుకుంటున్న బీజేపీ సభ్యులను స్పీకర్ ప్రస్తుత వారానికి సస్పెండ్ చేశారు. సభ సజావుగా సాగించాలని స్పీకర్ విజ్ఞప్తిని బీజేపీ ఎమ్మెల్యేలు లెక్కచేయకుండా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, లక్ష్మన్, రాజాసింగ్, ఎన్ వీవీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు స్పెన్షన్ మోషన్ను మంత్రి హరీష్ ప్రవేశ పెట్టగా స్పీకర్ ఆమోదించారు.