రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపొందించాలని కోరారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. టీఎస్పీఎస్సీలో 180 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. వారిలో 110 మంది రెగ్యులర్, 70 మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఉన్నారని చెప్పారు. టీఎస్పీఎస్సీ లో ఆటోమేషన్, ఈ-గవర్నెన్స్ వ్యవస్థ కోసం ప్రతిపాదనలు కూడా అందాయన్నారు. కమిషన్ ద్వారా చేపట్టే అన్ని నియామకాలు పకడ్బందీగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.