హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ నాటికి సాత్నాల ప్రాజెక్ట్ను పూర్తిచేసి 24 వేల ఎకరాలకు నీరిందిస్తమని మంత్రి హరీశ్రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి వనరులున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.