తెలంగాణ శాసన పరిషత్ కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డికి అమెరికాలోని కింగ్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్బంగా శాసనమండలి చైర్మన్ శ్రీ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, విప్ లు బి. వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు ఆయనను అభినందించి సన్మానించారు. ఈ అభినందన కార్యక్రమానికి శాసన సభ ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రత్యేకంగా వచ్చి పొంగులేటికి అభినందనలు తెలిపారు.