ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం పనితీరు బాగాలేదని ఏ పార్టీకి ఓటేసినా అవి చివరికి బీజేపీకే వెళ్తున్నాయని బీఎస్పీ, ఎస్పీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించడం, ఓ వ్యక్తి వీటిపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడంతో ఉన్నత న్యాయస్థానం స్పందించింది. ఈవీఎంల సామార్థ్యంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం పనీతీరుపై విచారణ జరిపేందుకు సీబీఐకి కూడా నోటీసులు జారీ చేయాలని అప్పీల్ చేసిన పిటిషనర్ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.