హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న మహబూబ్ నగర్, ఆదిలాబాద్, భద్రాచలం లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 39 డిగ్రీలుగా ఉంది. ఉష్ణోగ్రతలు ఇంకా ఒకటి నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ బేగంపేట అధికారులు వెల్లడించారు.