హైదరాబాద్ :iతెలంగాణ రాష్ట్రంలో 131 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమంలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. పేదింటి ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టామన్నారు. ముస్లిం విద్యార్థులకు రూ.20లక్షల ఓవర్సీర్ స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు.