హైదరాబాద్: ఇంటర్నెట్ సేవలను అందిస్తూ అగ్రగామిగా కొనసాగుతున్న డేటావిండ్ తన ఉత్పత్తుల శ్రేణులను మరింత విస్తరించే క్రమంలో 6 అంగుళాల అతిపెద్ద స్క్రీన్ కలిగిన మోర్జిమాక్స్ 3జి6 స్మార్ట్ఫోన్ను కేవలం రూ. 5999/ (సుమారు 90 యూఎస్ డాలర్లు) ధరతోనే నూతనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా డేటావిండ్ ప్రెసిడెంట్, సిఇవో సునీత్ సింగ్ తులి మాట్లాడుతూ ‘కెనడాకు చెందిన టొరంటొ నగర మేయర్ జాన్ టోరి తన విలువైన సమయాన్ని వెచ్చించి మా ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించడమే కాకుండా మోర్జిమాక్స్ 3జి6 స్మార్ట్ఫోన్ను ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం అని అన్నారు. ఈ మోర్జిమాక్స్ 3జి6 స్మార్ట్ఫోన్లో 6 అంగుళాల తాకే తెరతో పాటు ముందు వైపు 2 మెగాపిక్సల్స్ ఫ్రంట్ కెమేరా, వెనుకవైపు 8 మెగాపిక్సల్స్ రేర్ కెమెరా కలిగిఉంది.