జోగుళాంబ గద్వాల, మేజర్న్యూస్. ఈనెల 25 నుండి 29 వరకు గద్వాల మార్కెట్ యా ర్డు సమీపంలొ జరిగే గద్వాల సంబరాలను విజయవంతం చేయాలని జొగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్కుమర్ సైనీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లొ ఏర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలొ కలెక్టర్తొ పాటు ఎస్పీ విజయ్కుమార్ లు మాటా ్లడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు గద్వాల కళలు, స్థానిక కళాకా రులను చాటిచెప్పేవిదంగా సంబరాలు జరుగుతాయని తెలిపారు. చేనేత, ఉద్యా నవన ఇతర శాఖలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు వారి శాఖ తరపున అబివృద్దిని వివరిస్తారని తెలిపారు. అలాగే కళాకారులు సాయంత్రం సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని గద్వాలతొ పాటు కర్నూల్, హైదరాబాద్, నల్గొండ,ఖమ్మం తదితర ప్రాంతాలనుండి కళాకారులు వచ్చి తమకళను ప్రదర్శిస్తారని తెలిపారు. 25న నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలు ప్రారంబిస్తారని తెలిపారు. అలాగే అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపిలు నందిఎల్లయ్య, ఏపి జితేందర్ రెడ్డి, బండారి బాస్కర్, రాంచంద్రరావు, సిరెడ్డి నారాయణరెడ్డి,దామోదర్ రెడ్డి, డికెఅరుణ, సంపత్ కుమార్, కృష్ణవేణి రామాం జనేయులు, బి.వెంకటేశం, కలెక్టర్లు రొనాల్డ్రొస్, రెమారాజేశ్వరి, శ్వేతా మహంతి, రొహిణి ప్రియదర్శిని, శ్రీధర్, కల్మేశ్వర్ సింగన్వార్లు హాజర వుతారని తెలిపారు. ఎస్పీ విజయ్కుమార్ మాట్లాడుతు సంబరాలు విజయ వంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కొరారు.సంబరాలకు వచ్చే వాహనాలకు ట్రాఫిక్ నియంత్రణనిరవహిస్తున్నట్లు తెలిపారు. సంబరాలు ప్రతిఏటా జరిగేలా చూడాలని అన్నారు. ఈఉత్సవాలకు మంత్రులు, ఇతర విఐపిలు వస్తారని సాయంత్రం సాంస్క్రతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలొ డిఆర్ఒ రవీందర్ రెఢ్డి, తహశీల్దార్లు మం జుల, సుబ్రమణ్యం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.