న్యూఢిల్లీ : 2019 జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తానని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ధోనీ మాట్లాడుతూ... 2019 నాటికి ఫిట్గా ఉంటే తప్పకుండా ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక చేసే జట్టు సమయానికి సెలెక్టర్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ త్వరలో ఆటగాడిగా కూడా రిటెర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. దీనికి తోడు అతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి కొంత సమయం ఉంది. త్వరలో తలరా తలు తెలుస్తాయి అని అనడంతో ధోనీ రిటెర్మెంట్పై అనుమానం మరింత బలపడింది. ధోనీ తాజాగా చేసిన ప్రకటనతో అవన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడిప్పుడే క్రికెట్కి దూరమవ్వాలన్న ఆలోచనలో లేనని కూడా ధోనీ తెలి పాడు. ఢిల్లీలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ధోనీని అభిమా నులు 2019 ప్రపంచ కప్లో పాల్గొంటారా అనే ప్రశ్న సంధించారు. దీనికి ఆయన స్పందిస్తూ ప్రస్తుతం చాలా ఫిట్గా ఉన్నాను. ఎలాంటి ఫిట్నెస్ సమ స్య లేకపోతే ప్రపంచకప్ ఆడేందుకు అందుబాటులో ఉంటాను అని తెలిపా రు. 100 శాతం అందుబాటులోనే ఉంటారా అన్న మరో ప్రశ్నకు... 100 శాతం ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మనం 2017లో ఉన్నాం. ప్రపంచ కప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో ఏమైనా జరగవ చ్చు. 10 ఏళ్లుగా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాను. టీమిండియా షెడ్యూ ల్ గురించి నాకు తెలుసు, చాలా బిజీగా ఉంటుంది. జట్టు ఎంపికలో సెలక్ట ర్లు కీలకపాత్ర పోషిస్తారు. పాతకాలం క్రికెటర్లను ఎంపిక చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని ధోనీ తెలిపాడు.