హైదరాబాద్ : దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న రైల్వేలైన్ను ప్రారంభించామని కేంద్రరైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రైల్వే స్టేషన్లలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభించినట్లు తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్లో రోజుకు 3 లక్షల లీటర్ల వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ప్రారంభించారు. నిజామాబాద్ ఎంపి కవిత మాట్లాడుతూ 1932 నిజాం కాలంలో మొదటిసారిగా ఈ రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చిందని, తెలంగాణరాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ నేతల పోరాటాల ఫలితంగా నేడు దీనిని సాధించుకోగలిగామన్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్లు, వైఫై సౌకర్యం కల్పించాలని ఆమె మంత్రిని కోరారు.