రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం ఆధునాతన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ని కేటీఆర్, నాయిని, డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. గో లైవ్ అండ్ సిటిజెన్ సర్వీసెస్ పేరుతో కొత్త సాంకేతిక పరిజ్ఞాన్ని పోలీసు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు పారదర్శకమైన సేవలందించేందుకు విదేశాల్లో ఉన్న విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు. దేశంలోని మొత్తం 15వేల పోలీస్ స్టేషన్లలోని డేటా నిక్షిప్తమై ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించింది. ఈ కొత్త ప్రాజెక్టుతో ఎస్ఎమ్ఎస్ ద్వారా సిటీజన్ సర్వీసెస్ లను అందించడానికి వీళవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ తో త్వరిత గతిన కేసులను చేధించవచ్చని కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ, సోషల్ మీడియా వినియోగంలో రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ వల్ల నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసులను పరిష్కరించారని తెలంగాణ పోలీసులను అభినందించారు. ఇవాళ రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు.