టిఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అధ్యక్షుడిగా విజయభాస్కర్ రెడ్డి కొసన, గౌరవ చైర్ పర్సన్ గా కళ్యాణ్ రావు కాసుగంటి, ప్రధాన కార్యదర్శిగా నర్సింగ రావు ఇనగంటి, ఉపాధ్యక్షలుగా జగన్ రెడ్డి వాడ్నల, సీతారాం సాళ్వజి (న్యూజిలాండ్ కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్), రామారావు రాచకొండ, కోశాధికారిగా అభిలాష్ రావు యాచమనేని, విమెన్ అఫైర్స్ చైర్ పర్సన్ గా సునీత విజయ్, బిజినెస్ అఫైర్స్ చైర్ పర్సన్ గా ఇంద్ర సిరిగిరి, లీగల్ అఫైర్స్ చైర్ పర్సన్ గా సుశాంతి అరుణ్ ప్రకాష్, ఇమ్మిగ్రేషన్ అఫైర్స్ చైర్ పర్సన్ గా సుజిత్ సింగ్ ని నియమించారు. వీరితో పాటు న్యూజిలాండ్ శాఖలో జిల్లాల వారీగా ఇన్ చార్జులను ఎంపీ కవిత ప్రకటించారు. నరేందర్ రెడ్డి పట్లోళ్ల (నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మరియు మెంబర్ షిప్ ఇంచార్జి),ధర్మేందర్ అల్లె (రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మరియు మెంబర్ షిప్ ఇంచార్జి), రామ్మోహన్ దంతాల ( ఖమ్మం జిల్లా ఇంచార్జి),డాక్టర్ బీవీ మోహన్ రెడ్డి (మెదక్ జిల్లా ఇంచార్జి), రమణ సాళ్వజి (కరీంనగర్ జిల్లా ఇంచార్జి), కృష్ణా రెడ్డి ఆరెపల్లి (మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి),మల్లికార్జున రెడ్డి బద్దం (హైదరాబాద్ ఇంచార్జి),శ్రీనివాస్ పానుగంటి (నల్గొండ జిల్లా ఇంచార్జి), నర్సింగరావు పుప్పాల (ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి), శ్రీహరి రావు బండ (యూత్ వింగ్ ఇంచార్జి), అరుణ్ రావు పైడిగుమ్మల (ఐటి సపోర్ట్ ఇంచార్జి), అరుణ్ ప్రకాష్ రెడ్డి (కార్యవర్గ సభ్యులు), అశుతోష్ వాడ్నల (కార్యవర్గ సభ్యులు) టిఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆశయాలను, అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ నివసించే తెలంగాణ వాసులకు తెలియచేస్తుందని కొత్త అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి చెప్పారు. అవసరమైన సలహాలు సూచనలు స్వీకరించి తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రజలకు ఒక వారధిగా పనిచేస్తుందని, బంగారు తెలంగాణ ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత తమపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తుందని చెప్పారు. అక్టోబర్ 9, 2016న ఎంపీ కవిత న్యూజిలాండ్ లో టిఆర్ఎస్ శాఖను ప్రారంభించారు.