పండుగలంటే ఊర్లో హడావుడి మాములుగా ఉండదు. తెలుగు ప్రజలకు ఉగాది పండగ అంటే ఎంతో స్పెషల్. గ్రామాల్లో ఈ పండుగను కుటుంబ సభ్యుల నడుమ, ఆనందోత్సాహలతో సెలబ్రేట్ చేసుకుంటారు. పిండివంటలు, ఉగాది పచ్చడి ఇలా ఒక్కటేంటి మూడు నాలుగు రకాల వెరైటీలు చేయనిదే పండుగను జరుపుకోరు. మరి అలాంటి పల్లెటూరు వాతావారణాన్నే సిటీలోని ప్రముఖ హోటల్స్ ఏర్పాటు చేశాయి. ఉగాది వంటకాలను సిటీ పీపుల్ కోసం స్పెషల్ గా రెడీ చేసి అందిస్తున్నాయి. పిండి వంటలే కాకుండా ఇంకా ఎన్నో వెరైటీ వంటకాలను ఇప్పుడు సిటీలోని చాలా హోటల్స్ ఆఫర్స్ చేస్తున్నాయి. ఇక ఉగాది సందర్భంగా హోటల్స్ విలేజ్ అట్మాస్పియర్ అంబియన్స్ తో సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. రోజువారి మన లైఫ్లో టేస్ట్ చేయని ఎన్నో వంటకాలను ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. వెజ్తో పాటు నాన్వెజ్లో ఈ ఫెస్టివల్కి రిలేటెడ్ గా ఉన్న ఎన్నో డిఫరెంట్ డిషెస్ను రెడీ చేసి పెట్టారు. ఇప్పటి వరకు ఇలాంటి వంటకాలు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చూస్తు ఉండే వాళ్లం కానీ మారుతున్న పరిస్థితుల్లో ఆ టేస్ట్ లు ఇలాంటి ఫుడ్ పెస్టివల్స్ లలో నోరూరిస్తున్నాయి.