ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నైజీరియా విద్యార్థులపై దాడి జరిగింది. స్థానికులు ఆరుగురు నైజీరియా విద్యార్థులను చితకబాదారు. వీరందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐతే, నైజీరియా విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 19 ఏళ్ల విద్యార్థి ఒకరికి వాళ్లు ఇచ్చిన డ్రగ్స్ డోస్ ఎక్కువ కావటంతో అతను మృతి చెందాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రగ్స్ అమ్మిన నైజీరియా విద్యార్థులపై దాడి చేశారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎంను కోరారు. మరోవైపు, ఢిల్లీలోని నైజీరియా హై కమిషన్ అధికారులు హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.