కొత్తగా అటవీశాఖ, గిరిజనసంక్షేమ శాఖలో భారీ సంఖ్యలో పోస్టులను ప్రకటించనున్నారు. దాదాపు మూడువేల పోస్టుల వరకు మరికొన్ని రోజుల్లో ఆర్థికశాఖ అనుమతి రావచ్చని అధికారులు చెప్తున్నారు. త్వరలో జరుగనున్న రెండో విడుత కొలువుల భర్తీలో రాష్ట్ర అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండువేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులకు టీఎస్పీఎస్పీ ద్వారా రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ సమ్మతించినట్టు తాజా సమాచారం. రాష్ట్ర అటవీశాఖలో మొత్తం ఉద్యోగులు, కిందిస్థాయి అధికారుల సంఖ్య సుమారు ఐదువేలుండగా 2007 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.