ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కిషన్‌రెడ్డి పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 10:08 AM

జయశంకర్‌ భూపాలపల్లి: బీజేఎల్పీనేత కిషన్‌ రెడ్డి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కూడా తన పర్యటనను కొనసాగిస్తున్నారు. సింగరేణి కేటీకే ఐదో ఇంక్లైన్‌లో కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమాజానికి వెలుగునిచ్చేది సింగరేణి కార్మికులేనని అన్నారు. కార్మికుల వైద్య కోసం ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలి బీజేఎల్పీనేత కిషన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. కేంద్ర పథకాల గురించి వారికి వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులను కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీయే గెలుస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com