జనగాం : కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలును జనగాంలో నిలిపివేశారు. అయితే అప్పటికే రైలు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసింది. కాగా రైలు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానంతో రైల్వేశాఖ ఉన్నతాధికారులు డ్రైవర్కు బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు చేశారు. రైలు రెడ్ సిగ్నల్ దాటడానికి తన తప్పిదమేమీ లేదని సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపమే కారణమంటున్న డ్రైవర్ పేర్కొంటున్నాడు.