నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న ‘నెరుప్పుడా’ ఆడియో వేడుకను సోమవారం చెన్నైలోని శివాజీ గణేశ్ నివాసమైన అన్నై ఇల్లంలో ఘనంగా నిర్వహించారు. రజనీకాంత్ పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాల్ సారథ్యంలో తమిళ సినిమాకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవడానికి ఏవేవో గిమ్మిక్కులు చేస్తారని, పంపిణీదారులు వాటిని నమ్మి భారీ ధరకు సినిమాను కొనుక్కుని, చివరికి నష్టం వచ్చిందని అడగడం తప్పని అన్నారు. సినిమాలను అంచనా వేసి కొనుక్కుంటే ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో విశాల్, సత్యరాజ్, ప్రభు, ధనుష్ తదితరులు పాల్గొన్నారు...