సినిమా పంపిణీదారులను ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి, కొన్ని నెలలపాటు కష్టపడి తీసిన సినిమాను అమ్ముకోవడానికి నిర్మాతలు గిమ్మిక్కులు చేస్తారని, పంపిణీదారులు వాటిని నమ్మి మోసపోయి చివరికి నష్టం వచ్చిందని అడగడం తప్పని వ్యాఖ్యానించారు. అంచనాలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో నష్ట పరిహారం ఇవ్వాలంటూ నటీనటులపై ఒత్తిడి తెస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.