హైదరాబాద్: కంటిచూపుకు ఆవశ్యకమైన కార్నియాకు జరిగే హానికి చికిత్సపై వినూత్న వైజ్ఞానిక పరిష్కారాలను గురించి చర్చించేందుకు యూనివర్శిటీ ఆఫ్ షెషీల్డ్స, యూకే, ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థలు ప్రారంభించిన నాలుగు రోజుల వర్క్షాప్ నేడు ప్రారంభమైంది. 23 వరకూ జరిగే వర్క్షాప్లో భాగంగా, అప్లికేషన్ ఆన్ ఇన్నోవేటివ్ కెమిస్ట్రీ అండ్ బయోమెటీరియల్స్ టు ట్రీట్ కార్నియాస్ డేమేజ్డ్ బై ట్రామ్ అనే అంశంపై వర్క్షాప్ మొదలైంది. ఇండియాలో కోటి మంది అధత్వంతో బాధపడుతుంటే, అందులో అత్యధికులు కార్నియా సమస్యలతోనే ఇబ్బందులు పడుతున్నారనిరాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్ సాధార్న్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ మే-క్వే టార్కర్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ పరివోధకులు వివేక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.