ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగీరథ పనుల్లో నిర్లక్ష్యం చేసే ఏజెన్సీల తొలగింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2017, 01:18 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధి : మిషన్‌ భగీరథ పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టు ఏజెన్సీలను తొలగించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రికల్లో ఒకటైన మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి ఈఏడాది డిసెంబర్‌లోగా తాగు నీటిని అందించాలన్న లక్ష్యంతో భగీరథ ఇంజనీర్లు ముందు కుపో తున్నారు. ఇందులో భాగంగానే ముందస్తుగా నిర్ణయించిన మేర కు ప్రాజెక్టు పనులను పూర్తి చేయని కాంట్రాక్టు ఏజెన్సీలపై కొర ఢా ఝులిపించాలని ప్రభుత్వం నిర్ణయించారు.  భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్‌ ఏజెన్సీలను 60  నిబంధన కింద తొలగించడానికి కూడా వెనుకాడబోమని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ బి. సురేందర్‌ రెడ్డి తెలిపారు. గడువు లోగా మంచినీళ్లు అందించే క్రమంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. హైదరాబాద్‌ ఎర్ర మంజిల్‌ లోని ఈఎన్‌సీ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్‌.ఈ,ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ ను ఈఎన్‌సీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పైప్‌ లైన్‌ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశి ంచారు. రాత్రి  సమయంలో కూడా పైప్‌ లైన్‌ పనులు జరిగేలా చూడాలన్నారు. సూర్యాపేట డివిజన్‌ లో భగీరథ పనులు మంద కోడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ.ఎన్‌.సి, సంబంధిత వర్క్‌ ఏజెన్సీ ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. పాత మెదక్‌ జిల్లా లో వ్యవసాయభూముల కారణంగా ఆగిన పైప్‌ లైన్‌ పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన  నిర్మాణాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకో వాలన్నారు. మెటీరియల్‌, మెన్‌ కొరత లేకుండా చూడాలన్నారు. ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ కు సరైన సమాచారంతో రాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో  ప్రభుత్వ సలహా దారులు జ్ఞానేశ్వర్‌, చీఫ్‌ ఇంజనీర్లు సురేష్‌ కుమార్‌, కృపాకర్‌ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగ రావు,శ్రీనివాస్‌ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతా దికారులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com