హైదరాబాద్: ప్లీనరీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ప్లీనరీ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ అధ్యక్ష ఉపన్యాసంతో ప్లీనరీ ప్రారంభం కానుంది. మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం ప్రసంగించనున్నారు.