హైదరాబాద్ :అవినీతికి తావులేని విధంగా అత్యంత పారదర్శకంగా రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో డిపాజిట్ చేస్తామని ఆయన చెప్పారు. తొలి పంటకు మే నెల మొదటి వారంలో, రెండో పంటకు అక్టోబర్ లో ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సార్లు రైతు ఖాతాలో సొమ్ముడిపాజిట్ చుస్తామన్నారు. ఆ సొమ్ముతో ఎరువులకు ఎంత, విత్తనాలకు ఎంత వినియోగించుకుంటారన్నది రైతు ఇష్టమని కేసీఆర్ చెప్పారు.