హైదరాబాద్ : ప్రాజెక్టులకు అడ్డుపడేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. మూడేళ్లలో 2800 కి.మీ జాతీయ రహదారులను సాధించామని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కోసం కృషి చేస్తున్నామన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. కులవృత్తులన్నీ ఆర్థికంగా పునరుజ్జీవనం పొందాలని అన్నారు. చావులు చేనేత కార్మికుల సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు విధాన రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్కు రూ.1000కోట్లు కేటాయించామని తెలిపారు.