తమిళ నటుడు ధనుష్ కు ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకే నంటూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు. ధనుష్ తమ కుమారుడేనని, చిన్నప్పుడు స్కూలు చదువు మధ్యలోనే మానేసి.. ఇంటి నుంచి పారిపోయాడని మేలూరుకు చెందిన కదిరేశన్-మీనాక్షి దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కొన్ని పత్రాలను సైతం కోర్టుకు ఆ దంపతులు సమర్పించారు. దీంతో పుట్టుమచ్చలు చూపించాలని హీరో ధనుష్కు కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే దంపతులు చెప్పినట్లుగా ధనుష్కు పుట్టుమచ్చలు లేకపోవడంతో లేజర్ ట్రీట్మెంట్తో ఆయన తొలగించుకొని ఉంటాడని అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో డీఎన్ఏ టెస్టుకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగా.. అందుకు ధనుష్ నిరాకరించాడు. ఈ క్రమంలో వాదనలు విన్న మధురై బెంచ్ వృద్ధ దంపతుల పిటిషన్ను తోసిపుచ్చి.. ధనుష్కు ఊరటనిచ్చింది.