హైదరాబాద్ : కోఠీ ఆసుపత్రిలో మరో ప్రసూతి మరణం సంభవించింది. ప్రసవం కోసం కోఠీలోని ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణికి ఇన్ ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించింది. ఆమెను అక్కడ నుంచి ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. గుట్టు చప్పుడు కాకుండా ఆమెను స్వగ్రామానికి పంపించేశారు. కొఠీ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ సోకి గత రెండు రోజులలో ముగ్గురు బాలింతలు మరణించారు.