హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రెండ్రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశమున్నట్లు తెలిపారు. భద్రాచలం, ఖమ్మం, నల్లగొండలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మహబూబ్నగర్ 42, రామగుండం 42, ఆదిలాబాద్లో 41 డిగ్రీలు, హైదరాబాద్ 41, నిజామాబాద్ 41, హన్మకొండలో 40 డిగ్రీలు, మెదక్ 40 డిగ్రీలు, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు పేర్కొన్నారు.