వరంగల్ లో టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తరలి వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం అవుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ నేతలు ప్రజలను సమీకరిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నగరంలో ఆటో డ్రైవర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. వందలాది ఆటోలతో నిర్వహించే ప్రచార కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.