హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరుకానున్నారు. దాదాపు 18 వేల మంది పాల్గొనేందుకు వీలుగా ప్రాంగణాన్ని సెంట్రల్ ఎయిర్ కండిషన్తో సిద్ధం చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, అగ్నిమాపక దళం, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ, పోలీస్, రహదారులు భవనాలశాఖ, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, సమాచార, పౌరసంబంధాలశాఖ, సాంస్కృతికశాఖ, అగ్నిమాపకశాఖ, ప్రొటోకాల్ విభాగం తదితర అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సభావేదిక ప్రాంగణంలో స్వచ్ఛభారత్ చేపట్టారు. వేడుకల విజయవంతానికి ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు.