హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చేనెల 15 నుంచి నిర్వహించే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు నేటితో ముగియనుంది. మంగళవారంతోనే గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఇంటర్బోర్డు గడువును ఒక్కరోజు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించాలని బోర్డు ఆదేశించింది.