రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం ఉత్పత్తి ఉంటుందని అంచనా వేశామన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.1,510, బీ గ్రేడ్ రకానికి రూ.1,470 మద్దతు ధర అందిస్తున్నామన్నారు. రైతులెవరూ తొందరపడి రైస్మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయించవద్దని కోరారు. డిమాండ్ ఉన్న అన్నిచోట్లా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.